Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడా వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. చిన్నారులతో సహా 11 మంది మృతి

Webdunia
గురువారం, 4 మే 2023 (11:10 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక క్రీడా వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.యూ.వీ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా బంధువులు ఇంటిలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ ప్రమాదంబారినపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ధామ్‌తరి జిల్లా సోరా - భట్‌గావ్ గ్రామానికి చెందిన కంకేర్ జిల్లా మర్కటోలా గ్రామంలోని తమ బంధువుల ఇంట జరిగే వివాహానికి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జాతీయ రహదారి 30పై పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగార్తా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్రమాదంలో మహీంద్రా బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయింది. పురూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments