Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 ఏళ్ల బుడతడు పాక్ జలసంధిని ఈదేశాడు... 32 కిలోమీటర్ల సముద్రాన్ని?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (16:08 IST)
10 ఏళ్ల వయస్సు ఉన్న బుడతడు సముద్రంలో ఏకంగా 32 కిలోమీటర్ల దూరాన్ని ఈదేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 10 ఏళ్ల వయస్సులో చాలా మందికి నీళ్లంటే భయం ఉంటుంది. పైగా ఎంతో అనుభవం ఉంటే కానీ అలాంటి సాహసాలు సాధ్యం కాదు. ఈ చిచ్చరపిడుగు భారతదేశం మరియు శ్రీలంక దేశాల మధ్య ఉండే పాక్ జలసంధిలో శ్రీలంక నుంచి తమిళనాడులోని ధనుష్కోటికి.. ఏకంగా 32 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదేసి సరికొత్త ఫీట్‌ అందుకున్నాడు. 
 
తమిళనాడు థేనీ జిల్లాకు చెందిన 10 సంవత్సరాల జశ్వంత్‌కు చిన్ననాటి నుంచి ఈత కొట్టడం అంటే ఇష్టం. అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు స్విమ్మింగ్‌లో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత జశ్వంత్ స్విమ్మింగ్‌లో వండర్స్ క్రియేట్ చేసాడు. తాజాగా జశ్వంత్ పాక్ జలసంధిలో శ్రీలంకలోని తలైమనార్ నుంచి ధనుష్కోటికి 32 కిలోమీటర్ల దూరాన్ని పదిగంటల 30 నిమిషాల్లో రీచ్ అయ్యాడు.
 
శ్రీలంకలోని తలైమనార్ నుంచి ఉదయం 4 గంటలకు బయల్దేరి.. 9 గంటలకు అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడులోని ధనుష్కోటికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నాడు. ఈత కొట్టే సమయంలో హెల్త్ డ్రింక్స్‌..మంచినీళ్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో ధనుష్కోటికి చేరుకున్న జశ్వంత్‌కు తమిళనాడు డీజీపీ శైలేంద్ర, నౌకాదళ అధికారులు ఘనస్వాగతం పలికి అభినందించారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments