Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. పదిమంది శిశువులు మృతి

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (10:00 IST)
ముంబై ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర భాందరా జిల్లా ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది.  సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్‌(ఎస్ఎన్‌యూసీ)లో మంటలు చెలరేగడంతో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ యూనిట్‌లో 17 మంది శిశువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా ఏడుగురిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
 
10 మంది నవజాత శిశువులు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మోదీ ట్వీట్ చేశారు. అగ్నిప్రమాదంలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అమిత్ షా పేర్కొన్నారు. పసిపిల్లల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
 
భాందరా జిల్లా ఆస్పత్రిలో మరణించిన 10 మంది చిన్నారుల కుటుంబానికి మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments