Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (15:28 IST)
దేశంతో పాటు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన 'ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, 'మనందరి జీవితాల్లో ఎత్తు పల్లాలుంటాయి. మన మన సామాజిక జీవితాల్లో కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటాం. ప్రపంచమంతా ఒకేసమయంలో ఒకే సమస్యను ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు. 
 
ఈ వ్యాధి నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. వాక్సిన్ వచ్చేంత వరకూ రెండు గజాల దూరం పాటించాలి. మాస్కులను తప్పకుండా ధరించాలి. కరోనా సోకకుండా చూసుకోవాలి' అని సూచించారు. 
 
అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. దీనికి నిదర్శనమే నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాల్లో మరణాల సంఖ్య 1.30 లక్షలు ఉంటే, యూపీలో కేవలం 600 మాత్రమే ఉన్నాయని ప్రధాని మోడీ గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments