Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకృతికి మనిషికి మధ్య సామరస్యాన్ని నెలకొల్పేది యోగా : అమిత్ షా

ప్రకృతికి మనిషికి మధ్య సామరస్యాన్ని నెలకొల్పేది యోగా : అమిత్ షా
, ఆదివారం, 21 జూన్ 2020 (08:24 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దాని ప్రాముఖ్యతను తన ట్విట్టర్ ఖాతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. భారత సంస్కృతికి విలువైన బహుమతి యోగా అని అన్నారు. శరీరం, మనస్సు, మనిషి చర్య, ప్రతి చర్యలు, ప్రకృతి మధ్య సామరస్యాన్ని నెలకొల్పే సాధనం యోగా అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్లే ప్రపంచ దేశాలు యోగాను అంగీకరించి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు ముందుకు వచ్చాయని అమిత్ షా గుర్తుచేశారు.
 
కాగా, హరిద్వార్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు యోగాసనాలను వేశారు. ఆయనతో పాటు.. అనేక మంది యోగాసనాలు వేశారు.
 
అలాగే, హార్ట్​ఫుల్​నెస్ ఇన్​స్టిట్యూట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగ, ధ్యానం, సంగీతం కలగలిపి హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టి‌ట్యూట్, ఆయుష్ మంత్రాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న వర్చువల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమ్మేళనంలో యోగర్షి బాబా రాందేవ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత పి.గోపీచంద్, ప్రఖ్యాత యువ క్రీడాకారిణి కుమారి పి.వి.సింధు, హార్ట్‌ఫుల్‌నెస్ గైడ్ కమలేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వ రోగాలను ధీటుగా ఎదుర్కొనే శక్తి యోగాకు ఉంది : ప్రధాని నరేంద్ర మోడీ