Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు రిజైన్... 30న జగన్ ప్రమాణం.. ఏకాదశ తిథిలో...(video)

Webdunia
గురువారం, 23 మే 2019 (11:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నారా చంద్రబాబు నాయుడు మే 23వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేయనున్నారు. ఆయన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు తన రాజీనామా లేఖను పంపించనున్నారు. ఈ లేఖను ప్రత్యేక దూత లేదా ఫ్యాక్స్‌లో పంపించే అవకాశం ఉంది. 
 
మరోవైపు, నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 30వ తేదీ గురువారంతో పాటు... ఏకాదశ తిధి కావడంతో ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. 
 
ఇదిలావుండగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడవుతున్న విషయం తెల్సిందే. ఈ ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో, ఎగ్జిట్‌పోల్స్‌, సర్వేల అంచనాలకు సైతం అందకుండా.. తాజా అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించింది. 
 
ప్రస్తుతం అందుతున్న కౌంటింగ్‌ సరళిని చూసుకుంటే 150కిపైగా సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఘోర ఓటమి ఖాయం కావడంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయబోతున్నారు.

నేటి (గురువారం) సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా చంద్రబాబు గవర్నర్‌కు పంపించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిసే అవకాశముంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments