విశ్వసనీయత కోల్పోయిన 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి సర్వే

Webdunia
గురువారం, 23 మే 2019 (09:38 IST)
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలు మరోమారు తారుమారయ్యాయి. ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని బల్లగుద్ధి చెప్పారు. కానీ, గురువారం వెల్లడవుతున్న ట్రెండ్స్‌ ఫలితాల్లో వైకాపా ఫ్యాను గాలికి సైకిల్ కొట్టుకునిపోయింది. ఉదయం 9.30 గంటల ట్రెండ్స్ మేరకు వైకాపా 82 సీట్లు, సైకిల్ 23, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, లోక్‌సభ సీట్లలో కూడా టీడీపీ, వైకాపాలు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
 
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూడా ఎన్డీయే కూటమి ఏకంగా 307 చోట్ల ఆధిక్యంలో ఉండగా, యూపీఏ 101 చోట్ల, ఇతరులు 98 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఓట్లు సాధించింది. ముఖ్యంగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకతో ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. ఈ ట్రెండ్స్ ఇదే విధంగా కొనసాగిన పక్షంలో బీజేపీ కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments