Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ఓట్ల సునామీ : ముగ్గురు కేంద్ర మంత్రుల ఓటమి

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (08:34 IST)
17వ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓట్ల సునామీ సృష్టించారు. ఫలితంగా కమలదళం 301 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 350 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
అయితే, మోడీ సునామీ దెబ్బకు బడాబడా పార్టీల పీఠాలు కదిలిపోయాయి. ఇలాంటి సానుకూల పవనాల్లో అనేక మంది బీజేపీ అభ్యర్థులు, మంత్రుల వైఫల్యాలు పెద్దగా కనిపించలేదు. దీంతో అతి సునాయాసంగా వారిని విజయం వరించింది.
 
అయితే, బీజేపీకి చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు మాత్రం ఓడిపోయారు. పంజాబ్ రాష్ట్రం నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి 99 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోగా, ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్జీత్‌సింగ్‌ ఔజ్లా విజయం సాధించారు. 
 
అదేవిధంగా కేరళలోని ఎర్నాకులం నుంచి బరిలోకి దిగిన కేంద్రమంత్రి కె.జె.అల్ఫోన్స్‌ 3.50 లక్షల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఈ సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి హిబి ఎడెన్‌ గెలుపొందారు. ఇక ఉత్తర ప్రదేశ్‌లోని గాజీపూర్‌ నుంచి పోటీచేసిన కేంద్రమంత్రి మనోజ్‌సిన్హా 1.15 లక్షల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ విజయఢంకా మోగించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments