Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి తీరుతాం : తేల్చిచెప్పిన రైతులు

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (11:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవితను ఓడించి తీరుతామని స్థానిక రైతులు ప్రతిజ్ఞ చేశారు. అందువల్ల ఎన్నికల బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని వారంతా తేల్చి చెప్పారు. 
 
నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కవిత పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఆమెపై 180 మందికిపైగా రైతులు పోటీ చేయడమే ఇందుకు కారణం. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కవిత ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు ఆమెపై బరిలోకి దిగారు. 
 
దీంతో ఓట్లు చీలిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ వారితో నామినేషన్లు ఉపసంహరింపజేయాలని ప్రయత్నించింది. సమస్యలు పరిష్కరిస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే, రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గేది లేదని, బరిలోనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. 
 
నామినేషన్ల ఉపసంహరణ గడువు 28వ తేదీ శుక్రవారంతో పూర్తికానుండగా ఒక్క రైతు కూడా ముందుకు రాకపోవడంతో తెరాస నేతలను కలవరపరుస్తోంది. ఈ స్థానం నుంచి మొత్తం 203 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన అనంతరం 189 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, పిరమిడ్‌, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌తో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు ఉండగా, మిగతా వారంతా రైతులే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments