Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం... ప్రచారం బంద్.. ఐఏఎస్ బదిలీ

Webdunia
గురువారం, 16 మే 2019 (12:14 IST)
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నిర్ణీత గడువు కంటే ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిషేధించింది. దీంతో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రచారం గురువారం రాత్రి 10 గంటలతోనే ముగియనుంది. వాస్తవానికి ఈ దశ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియాల్సివుంది. 
 
రెండు రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టిన రోడ్ షో సందర్భంగా బీజేపీ - టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగిన విషయం తెల్సిందే. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించి ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసింది. 
 
అంతేకాకుండా, ప్రభుత్వ అధికారులపై కొరడా ఝుళిపించింది. ఓవైపు అధికార తృణమూల్, బీజేపీల మధ్య వీధి పోరాటాలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. సీఐడీ ఏడీజీ రాజీవ్ కుమార్‌ను కేంద్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆయన వెంటనే ఢిల్లీలోని హోంశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎంతో కీలకమైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భట్టాచార్యపైనా వేటు పడింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని సీఈవోకు లేఖ రాయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments