యోగి ఆదిత్యనాథ్ వింత చర్యలు... ప్రచారం కోసం అలా చేశారు...

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (10:37 IST)
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఆయనపై మూడు రోజుల పాటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 
 
మంగళవారం గోరఖ్‌నాథ్ దేవాలయంలో భక్తులకు హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉండే యోగి చాలీసాను అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించిన వైనం భక్తులను ఆకట్టుకుంది. స్థానిక గోరఖ్‌నాథ్ మఠానికి ఆయన ప్రధాన గురువు అని తెలిసిందే.
 
ఇక, బుధవారం తన నివాసంలో ఓ ట్రిపుల్ తలాక్ బాధితురాలితో మాట్లాడి ఆమెలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా వాసి నజియా ఇటీవలే ట్రిపుల్ తలాక్ కారణంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తన నివాసంలో ఆమెతో మాట్లాడుతూ అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
ఆపై యోగి ఓ దళితుడి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆ దళితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను విస్మయానికి గురిచేశారు. యోగి తన భోజనాన్ని అక్కడే ముగించడం కూడా ఎవరి ఊహకు అందలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments