Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్‌ను క్షమించానన్న జగన్... కేసీఆర్ నోట్లో పచ్చి వెలక్కాయ...

Advertiesment
Jagan Mohan Reddy
, శనివారం, 6 ఏప్రియల్ 2019 (19:10 IST)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ వుండరని అంటుంటారు. ఇది చాలాసార్లు రుజువైంది కూడా. ఇక ఇప్పటి విషయానికి వస్తే... కొద్దిరోజుల క్రిత తెలంగాణ తెరాస నాయకుడు కేటీఆర్ మాట్లాడుతూ... తాము, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరం కలిసి పనిచేస్తామని అన్నారు. 
 
అంటే.. కేంద్రంలో కాంగ్రెసేతర పార్టీలకు మద్దతు తెలుపుతామని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ ప్రకారంగా చూస్తే జగన్ మోహన్ రెడ్డి కూడా కాంగ్రెసేతర పార్టీలకే మద్దతు ఇవ్వాల్సి వుంటుంది. ఒకవేళ భాజపా మ్యాజిక్ మార్కుకి కాస్త దూరంలో నిలబడితే బలాన్ని వైసీపీ ఇవ్వాలన్నమాట. ఐతే దుర్లభం అని జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యల ద్వారా తేలిపోయింది. 
 
ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి భాజపా మోసం చేసిందనీ, అలాంటి పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు జగన్. కాబట్టి కేంద్రంలో వైకాపా సపోర్ట్ భాజపాయేతర పార్టీలకు మాత్రమే జగన్ మోహన్ రెడ్డి ఇస్తారని అర్థమవుతుంది. ఆ ప్రకారం చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుకున్న ఆశలకు జగన్ గండి కొట్టినట్లే అవుతుంది. చూడాలి ఎన్నికల ఫలితాలు ఎవరిని ఎలా మారుస్తాయో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీలక నేతలు, కీలకమైన ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచేదెవరో...?