Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన నక్సల్స్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (11:02 IST)
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో నక్సల్స్ దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. ఈనెల ఒకటో తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గడ్చిరోలిలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు 16 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని పేల్చివేశారు. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సారైకేలా జిల్లా, కుంతీ లోక్‌సభ పరిధిలోని కర్సవాన్‌లోని బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చి వేశారు. గురువారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన నక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి పార్టీ ఆఫీస్‌ను పేల్చి వేశారు.
 
కుంతి లోక్‌సభ స్థానం నుంచి జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కుంతితో పాటు కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో నేడు అమిత్ షా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాల్సి వుంది. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా 6వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments