Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన నక్సల్స్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (11:02 IST)
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో నక్సల్స్ దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. ఈనెల ఒకటో తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గడ్చిరోలిలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు 16 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని పేల్చివేశారు. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సారైకేలా జిల్లా, కుంతీ లోక్‌సభ పరిధిలోని కర్సవాన్‌లోని బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చి వేశారు. గురువారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన నక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి పార్టీ ఆఫీస్‌ను పేల్చి వేశారు.
 
కుంతి లోక్‌సభ స్థానం నుంచి జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కుంతితో పాటు కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో నేడు అమిత్ షా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాల్సి వుంది. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా 6వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments