Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ మిస్టర్ క్లీన్... అవినీతిపరుడంటే ఎవరూ నమ్మరు : బీజేపీ మంత్రి

Webdunia
గురువారం, 9 మే 2019 (13:54 IST)
మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, రాజీవ్ నంబర్ వన్ అవినీతిపరుడంటూ ఆరోపించారు. దీన్ని బీజేపీ నేత, కేంద్ర మంత్రి శ్రీనివాస ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.
 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ అనవసరంగా మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా, రాజీవ్ అవినీతిపరుడు అంటే దేశంలో ఎవరు నమ్మరన్నారు. రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి నేతలు సైతం రాజీవ్‌ను ప్రశంసల వర్షంలో ముంచెత్తారని గుర్తుచేశారు. 
 
రాజీవ్ గాంధీ తన రాజకీయ జీవితంలో మిస్టర్ క్లీన్‌గా బతికాడని ప్రశంసించారు. ఎల్టీటీఈ కుట్రలో భాగంతో రాజీవ్ గాంధీ హతమయ్యాడన్నారు. చిన్న వయసులోనే రాజీవ్ గాంధీ పెద్ద బాధ్యతలు చేపట్టి దేశానికి సేవ చేశారని కొనియాడారు. మోడీ అంటే తనకు కూడా గౌరవం ఉందని రాజీవ్ గాంధీ జీవితం అవినీతి పరుడిగా ముగిసిందనడం తప్పని సూచించారు. కర్ణాటక రాష్ట్రంలోని చమరాజ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments