Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి : అనుపమ్‌ను నిలదీసిన ఓటర్లు

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి : అనుపమ్‌ను నిలదీసిన ఓటర్లు
, బుధవారం, 8 మే 2019 (14:31 IST)
సార్వత్రిక ఎన్నికల్లో పలువురు సెలెబ్రిటీలు వివిధ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారానికి వెళ్లిన చోటల్లా ఘోర అవమానాలు ఎదురువుతున్నాయి. 
 
రెండు రోజుల క్రితం జనం లేక అనుపమ్‌ సభ రద్దవగా... అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలంటూ ఓ వ్యక్తి బుధవారం ప్రశ్నించాడు. చంఢీగడ్‌ నుంచి అనుపమ్‌ భార్య కిరణ్‌ఖేర్‌ పోటీ చేస్తుండడంతో ఆయన అక్కడ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఓ షాపులోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు అనుపమ్‌. ఐతే.. బీజేపీ ఏం చేసింది? అసలెందుకు మీకు ఓటెయ్యాలంటూ ఆ షాపు యజమాని అనుపమ్‌ను నిలదీశాడు. అంతటితో ఆగకుండా 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి.. ఇందులో ఏ ఒక్కటైనా అమలు చేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. షాక్‌ తిన్న అనుపమ్‌.. తెల్ల ముఖం వేసుకుని.. అక్కడి నుంచి బయటపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌కి ఉగ్రముప్పు.. సముద్ర మార్గం ద్వారా ఏపీలోకి?