మోడీని కాదు.. అమితాబ్‌ను ఎన్నుకుని ఉండాల్సింది : ప్రియాంకా

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (19:54 IST)
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ స్థానంలో బాలీవుట్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ప్రజలు ఎన్నుకుని ఉండాల్సిందని ఏఐసీసీ యూపీ వెస్ట్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సెటైర్లు వేశారు. ఆమె శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్, సలెంపూర్‌లలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు మోడీ అని, ప్రజలు ఆయనకు బదులు అమితాబ్ బచ్చన్‌ను ప్రధానిగా ఎన్నుకుని ఉండాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకంటే, మోడీగానీ, అమితాబ్ బచ్చన్‌గానీ ప్రజలకు సేవ చేసిన దాఖలాలు లేవన్నారు. 
 
అభివృద్ధి అజెండా కంటే, పబ్లిసిటీ, అబద్ధాలతోనే మోడీ లబ్ది పొందాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారణాసి ప్రజలకు మోడీ ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నాయకుడు అనేవాడు ప్రజలకు నిజాలు చెప్పాలని, మోడీ మాత్రం అవాస్తవాలు చెబుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments