Webdunia - Bharat's app for daily news and videos

Install App

17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం పరిసమాప్తం... 19న పోలింగ్

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (20:03 IST)
దేశ 17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. తుది దశ అంటే ఏడో విడత పోలింగ్ ఈ నెల 19వ తేదీ ఆదివారం జరుగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి. 23వ తేదీన సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
 
కాగా చివరి దశలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 13 స్థానాలు, పంజాబ్‌లో 13 స్థానాలు, వెస్ట్ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3 చొప్పున లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుంది.  కు పోలింగ్‌ కొనసాగనుంది. యూపీలో మొత్తం 13 స్థానాల్లో 167 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తుది విడతలో పశ్చిమబెంగాల్ లోని 9 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
 
ఈ చివరి దశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (వారణాసి)తో పాటు.. కేంద్ర మంత్రి హర్దీప్  సింగ్ పూరి (అమృతసర్), సన్నీడియోల్ (గురుదాస్‌పూర్), కేంద్రమంత్రి హరిసిమ్రత్ కౌర్ (భటిండా), పాట్నాసాహిబ్ స్థానం నుంచి శతృఘ్నసిన్హా (కాంగ్రెస్), బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు బరిలో ఉన్నారు. 59 సీట్లలో మొత్తం 918 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments