Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని కాదు.. అమితాబ్‌ను ఎన్నుకుని ఉండాల్సింది : ప్రియాంకా

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (19:54 IST)
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ స్థానంలో బాలీవుట్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ప్రజలు ఎన్నుకుని ఉండాల్సిందని ఏఐసీసీ యూపీ వెస్ట్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సెటైర్లు వేశారు. ఆమె శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్, సలెంపూర్‌లలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు మోడీ అని, ప్రజలు ఆయనకు బదులు అమితాబ్ బచ్చన్‌ను ప్రధానిగా ఎన్నుకుని ఉండాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకంటే, మోడీగానీ, అమితాబ్ బచ్చన్‌గానీ ప్రజలకు సేవ చేసిన దాఖలాలు లేవన్నారు. 
 
అభివృద్ధి అజెండా కంటే, పబ్లిసిటీ, అబద్ధాలతోనే మోడీ లబ్ది పొందాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారణాసి ప్రజలకు మోడీ ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నాయకుడు అనేవాడు ప్రజలకు నిజాలు చెప్పాలని, మోడీ మాత్రం అవాస్తవాలు చెబుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments