ఈనెల 9న ఒడిశాలో పర్యటించనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (13:16 IST)
ఆంధ్రప్రదేశ్లో కీలక ప్రాజెక్టుల పూర్తిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఈనెల 9న ఒడిశాలో పర్యటించనున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించనున్నారు. ముఖ్యగా జలవివాదాల పరిష్కారంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. వంశధార నదిపై నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్ పూర్తి చేయడానికి ఒడిశా ప్రభుత్వ సహకారాన్ని కోరనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. జగన్ తన పర్యటనలో ఒడిశా సీఎంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను కలవనున్నారు.
 
 
వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలని ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని గతంలో రాసిన లేఖలో సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌ ను కోరారు. ఆ క్రమంలో జగన్ ఒడిశా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం తొలి నుంచి అభ్యంతరాలు తెలుపుతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఒడిశా వాదిస్తోంది. నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఒడిశా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments