Webdunia - Bharat's app for daily news and videos

Install App

షోవోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్.. ఏ సిరీస్ నుంచి చివరి ఫోన్

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (12:25 IST)
Xiaomi Mi A4
షావోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ రానుంది. ఎలాంటి కస్టమైజ్డ్‌ యూఐ లేకుండా ప్యూర్‌ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకునేవారి కోసం షావోమి ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద 'ఏ' సిరీస్‌ ఫోన్లను తీసుకొస్తోంది. 
 
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఎంఐ ఏ1, ఏ2, ఏ3 ఫోన్లు వచ్చాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లు కావడంతో యువతలో వీటికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే, ఇకపై ఈ సిరీస్‌లో ఎలాంటి ఎలాంటి ఫోన్లు రావు. ఇటీవలే ఆ కంపెనీ ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంటే ఏ3నే ఈ సిరీస్‌లో చివరి ఫోన్‌ అన్నమాట.
 
ఈ సిరీస్‌లో ఫోన్లను తీసుకురాకపోవడానికి షావోమి ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు. అయితే, ఈ ఫోన్లకు అప్‌డేట్లు అందించడమొక్కటే ఆ కంపెనీ భారంగా భావిస్తోందని సమాచారం. 
 
ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద మూడేళ్ల పాటు అప్‌డేట్స్‌ అందించాల్సి ఉంటుంది. అందుకే ఇకపై ఈ ఫోన్లను తీసుకురాకుండా తన ఆండ్రాయిడ్‌ ఫోన్లను కస్టమైజ్‌ చేసి ఎంఐయూఐతోనే తీసుకురావాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments