Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ తప్పూ చయలేదు... ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు : టిక్ టాక్ ఇండియా

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (10:15 IST)
భారత సార్వభౌమత్వానికి, గోప్యతకు విఘాతంగా మారాయన్న కారణంతో టిక్ టాక్, షేరిట్ వంటి అత్యంత పాప్యులర్ యాప్స్ సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. దీనిపై టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ స్పందించారు. తాము ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరుగలేదని స్పష్టం చేశారు. 
 
"భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. భారత యూజర్లకు చెందిన సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోలేదు" అని ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని, తమ అభ్యంతరాలను తెలియజేస్తామని, ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేస్తామని ఆయన అన్నారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌ను వాడకుండా నిషేధం విధించినా, ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవడం, అన్ని స్మార్ట్ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తీసేయడం అనుకున్నంత సులువు కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
వీటిని డౌన్‌లోడ్ చేసుకున్న వారు వాడకుండా చూడటం చాలా కష్టమని అంటున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లు వీటిని ఇప్పటికే తొలగించగా, యాప్స్‌కు సంబంధించిన వెబ్ సైట్లు, ఇతర వెబ్ సైట్ల నుంచి 'ఏపీకే'లను డౌన్ లోడ్ చేసుకుని వాడుకునే వారు వాడుకుంటూనే ఉంటారని నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments