ఏ తప్పూ చయలేదు... ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు : టిక్ టాక్ ఇండియా

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (10:15 IST)
భారత సార్వభౌమత్వానికి, గోప్యతకు విఘాతంగా మారాయన్న కారణంతో టిక్ టాక్, షేరిట్ వంటి అత్యంత పాప్యులర్ యాప్స్ సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. దీనిపై టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ స్పందించారు. తాము ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరుగలేదని స్పష్టం చేశారు. 
 
"భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. భారత యూజర్లకు చెందిన సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోలేదు" అని ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని, తమ అభ్యంతరాలను తెలియజేస్తామని, ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేస్తామని ఆయన అన్నారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌ను వాడకుండా నిషేధం విధించినా, ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవడం, అన్ని స్మార్ట్ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తీసేయడం అనుకున్నంత సులువు కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
వీటిని డౌన్‌లోడ్ చేసుకున్న వారు వాడకుండా చూడటం చాలా కష్టమని అంటున్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లు వీటిని ఇప్పటికే తొలగించగా, యాప్స్‌కు సంబంధించిన వెబ్ సైట్లు, ఇతర వెబ్ సైట్ల నుంచి 'ఏపీకే'లను డౌన్ లోడ్ చేసుకుని వాడుకునే వారు వాడుకుంటూనే ఉంటారని నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments