Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత' దాటిన చైనా - భారత భూభాగంలోకి వచ్చిన డ్రాగన్ సైనికులు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (09:20 IST)
భారత్ - చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీనికి కారణం చైనా సైనికులు హద్దుమీరిన చర్యల కారణంగా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. మరోవైపు, తాజాగా చైనా వాస్తవాధీన రేఖను దాటింది. భారత భూభాగంలోకి ఏకంగా 423 మీటర్ల మేర చైనా సైన్యం ముందుకు వచ్చినట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
1960లో చైనా పేర్కొన్న సరిహద్దును దాటి మరీ ముందుకు వచ్చినట్టు ఆ చిత్రాల ద్వారా తెలుస్తోంది. గల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మంగళవారం భారత్ - చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇప్పటివరకు జరిగిన రెండు దఫాల చర్చలు చైనా వైపున ఉన్న మోల్డోలో జరగ్గా, నేటి చర్చలు భారత భూభాగంలోని చుల్‌షుల్‌లో జరగనున్నాయి.
 
కాగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చైనానే కారణమని, తొలిసారి చర్చలు జరిగినప్పుడు గల్వాన్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఇరు దేశాల సైనికులు ఉండరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించడమే అందుకు కారణమని కేంద్రమంత్రి వీకే సింగ్‌ అన్నారు. చైనా సైనికులు అక్కడ నిర్మించిన గుడారం కాలి బూడిద కావడమే ఘర్షణకు కారణమైందన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments