Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందా?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:48 IST)
ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ప్రస్తుత సిఈఓ సుందర్ పిచాయ్ మన భారతీయుడు. గూగుల్ యాజమాన్యం మాత్రం అనేకమందిని, అనేక రకాలుగా పరీక్షించి ఏరికోరి మరీ పిచాయ్‌ను సిఈఓగా నియమించింది. అయితే ఇప్పుడు ఈ భారతీయ నాయకుడిపై నమ్మకం సన్నగిల్లుతోందట. అయితే ఆ అపనమ్మకం వేరే ఎవరికో కాదు గూగుల్ ఉద్యోగులకేనట.
 
వివరాల్లోకి వెళితే గూగుల్ సంస్థ ప్రతి ఏడాది అనేక అంశాలపై తమ సంస్థలోని ఉద్యోగుల అభిప్రాయాలను సేకరిస్తుంది. దీని కోసం గూగులెగిస్ట్ పేరుతో వార్షిక పోల్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది సుందర్ పిచాయ్ పనితీరు గురించి ఆయన నాయకత్వంలో సంస్థ మరింత ముందుకు వెళ్తుందా అన్న ప్రశ్నకు 78 శాతం మంది అవును అని తెలిపారు, అయితే ఇదే ప్రశ్నకు గతేడాది 88 శాతం మంది అనుకూలంగా ఓటువేసారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 10 శాతం ఉద్యోగుల్లో పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లినట్లు సమాచారం.
 
పిచాయ్ తీసుకునే నిర్ణయాలు వ్యూహాలు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయనే దానికి బదులుగా 75 శాతం మంది అనుకూలంగా స్పందించారు... అయితే గతేడాదితో పోల్చితే ఈ విషయంలో కూడా 13 శాతం మంది అపనమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. రోజురోజుకీ తనపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో పిచాయ్ తన సంస్థ భవిష్యత్తు కోసం ఏవైనా సంస్కరణలు చేపడతాడో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments