Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ 'దీపావళి' : రూ.2500కే 4జీ స్మార్ట్‌ఫోన్?

ఎయిర్‌టెల్ 'దీపావళి' : రూ.2500కే 4జీ స్మార్ట్‌ఫోన్?

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (06:45 IST)
ఎయిర్‌టెల్ తాను త‌యారు చేయ‌నున్న 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత చౌక‌గా కేవ‌లం రూ.2500ల‌కే అందించ‌నున్న‌ట్టు తెలిసింది. కాగా ఇప్ప‌టికే ఈ ఫోన్ త‌యారీ కోసం ప‌లు మొబైల్ త‌యారీ కంపెనీల‌తో ఎయిర్‌టెల్ చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. 
 
డిస్‌ప్లే, కెమెరా, బ్యాట‌రీ వంటి మూడు అంశాల్లో యూజ‌ర్‌కు అన్ని విధాలుగా నచ్చేవిధంగా కాన్ఫిగ‌రేష‌న్ ఉండేలా ఫోన్‌ను తేవాల‌ని ఎయిర్‌టెల్ భావిస్తున్న‌ట్టు సమాచారం. ఇందులో భాగంగానే లావా, కార్బ‌న్ వంటి సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. 
 
అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే సెప్టెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు లేదా అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఎయిర్‌టెల్ త‌న బ‌డ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తున్న‌ది. అయితే, ఈ వార్తలపై ఎయిర్‌టెల్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికార‌క స‌మాచారం వెల్ల‌డించ‌లేదు. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్‌ ఫోన్‌ను అందజేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, ఐడియా త‌న కంపెనీ ద్వారా చాలా త‌క్కువ ధ‌ర‌కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామ‌ని వెల్లడించింది. ఇదే కోవ‌లో ప్ర‌స్తుతం ఎయిర్‌టెల్ కూడా చౌక ధ‌ర‌కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించ‌నున్న‌ట్టు ప్రకటించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments