Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ 'దీపావళి' : రూ.2500కే 4జీ స్మార్ట్‌ఫోన్?

ఎయిర్‌టెల్ 'దీపావళి' : రూ.2500కే 4జీ స్మార్ట్‌ఫోన్?

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (06:45 IST)
ఎయిర్‌టెల్ తాను త‌యారు చేయ‌నున్న 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత చౌక‌గా కేవ‌లం రూ.2500ల‌కే అందించ‌నున్న‌ట్టు తెలిసింది. కాగా ఇప్ప‌టికే ఈ ఫోన్ త‌యారీ కోసం ప‌లు మొబైల్ త‌యారీ కంపెనీల‌తో ఎయిర్‌టెల్ చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. 
 
డిస్‌ప్లే, కెమెరా, బ్యాట‌రీ వంటి మూడు అంశాల్లో యూజ‌ర్‌కు అన్ని విధాలుగా నచ్చేవిధంగా కాన్ఫిగ‌రేష‌న్ ఉండేలా ఫోన్‌ను తేవాల‌ని ఎయిర్‌టెల్ భావిస్తున్న‌ట్టు సమాచారం. ఇందులో భాగంగానే లావా, కార్బ‌న్ వంటి సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. 
 
అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే సెప్టెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు లేదా అక్టోబ‌ర్ మొద‌టి వారంలో ఎయిర్‌టెల్ త‌న బ‌డ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తున్న‌ది. అయితే, ఈ వార్తలపై ఎయిర్‌టెల్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికార‌క స‌మాచారం వెల్ల‌డించ‌లేదు. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్‌ ఫోన్‌ను అందజేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, ఐడియా త‌న కంపెనీ ద్వారా చాలా త‌క్కువ ధ‌ర‌కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామ‌ని వెల్లడించింది. ఇదే కోవ‌లో ప్ర‌స్తుతం ఎయిర్‌టెల్ కూడా చౌక ధ‌ర‌కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించ‌నున్న‌ట్టు ప్రకటించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments