Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారుల ప్రాణాలు తీసే 'బ్లూ వేల్‌ ఛాలెంజ్'... సుప్రీం ఏమంటోంది?

చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న 'బ్లూ వేల్‌ ఛాలెంజ్‌'పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (06:34 IST)
చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న 'బ్లూ వేల్‌ ఛాలెంజ్‌'పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. బ్లూవేల్‌ లింకులకు సంబంధించి ఆయా సంస్థలకు తక్షణ ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది గుర్మీత్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. 
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ కూడిన ధర్మాసనం దీనిపై కేంద్రానికి, అటు ఢిల్లీ పోలీసులకు సైతం ఏయే చర్యలు చేపట్టారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. చిన్నారుల ప్రాణాలను తీస్తున్న 'బ్లూవేల్‌ ఛాలెంజ్‌' గేమ్‌కు సంబంధించిన లింకులు తొలగించాలని ఆయా సంస్థలకు ఇటీవల కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఏవేం చర్యలు తీసుకున్నారో తెలుపుతూ నివేదిక సమర్పించాలని ఆయా సంస్థలకు హైకోర్టు సూచించింది. ఈ నెల 28లోగా తమ స్పందన తెలపాలని పేర్కొంది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం