Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్‌ను ట్రోల్ చేసిన శామ్‌సంగ్.. లక్షలు పెట్టి ఫోన్‌ కొంటే ఛార్జర్ ఇవ్వరా?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (12:42 IST)
Iphone
ఐఫోన్‌ను శామ్‌సంగ్ ట్రోల్ చేసింది. ఐఫోన్ 12 సిరీస్‌ను ఇటీవలే యాపిల్ సంస్థ ప్రకటించింది. దీని ధరలు ఎప్పటిలాగే ఆకాశాన్ని తాకాయి. అయితే ఓ విషయంపై మాత్రం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అదేమిటంటే ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ ఫోన్‌ను కొన్నవారికి ఛార్జర్ ఇవ్వకపోవడమే. లక్ష రూపాయలు మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఛార్జర్ ఇవ్వకపోవడం ఏమిటని శామ్‌సంగ్ ప్రశ్నించింది. 
 
యాపిల్ ఫోన్‌ను కొనడమే కాకుండా మళ్లీ ఛార్జర్ కొండమేమిటని నెటిజన్లు యాపిల్ సంస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో యాపిల్ ను ట్రోల్ చేస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
 
శాంసంగ్.. యాపిల్ సంస్థకు రైవల్ అన్న సంగతి తెలిసిందే. తన తాజా పోస్టులో యాపిల్ కంపెనీని ట్రోల్ చేస్తూ పోస్టు పెట్టింది. 'మీ గెలాక్సీ.. మీరు ఏది కోరుకుంటున్నారో అది ఇస్తుంది.. ఛార్జర్, బెస్ట్ కెమెరా, బ్యాటరీ, పెర్ఫార్మన్స్, 120 హెడ్జెస్ స్క్రీన్' అంటూ ఫేస్ బుక్‌లో పోస్టు చేసింది. 
 
ముఖ్యంగా నలుపు రంగు ఉన్న ఛార్జర్ ఫోటోను పోస్టు చేసి తాము ఛార్జర్ ఇస్తామని తెలిపింది. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 70వేలకు పైగా రియాక్షన్లు వచ్చాయి, 10000కు పైగా కామెంట్లు చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments