Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రిలయన్స్ వార్షిక సమావేశం... భారీ వరాలు...

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (11:12 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రియలన్స్ 42వ వార్షిక సమావేశం సోమవారం జరుగనుంది. ఈ సమావేశంలో మరోమారు భారీగా వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, రిలయన్స్ జియో సేవలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో ఇపుడు కొత్తగా జియో గిగాఫైబర్, గిగా టీవీ సర్వీస్, జియో ఫోన్3లను ఈ సమావేశంలో ఆవిష్కరించవచ్చని తెలుస్తోంది. 
 
గతంలో ఈ సమావేశాల్లో భాగంగానే జియో సిమ్‌ను, జియో ఫోన్‌ను ముఖేష్ విడుదల చేశారు. జియో సిమ్ సర్వీసులు టెలికాం రంగంలో పెను సంచలనాన్నే రేపాయి. అప్పటివరకూ వెలుగొందిన ఎయిర్‌టెల్, ఐడియా వంటి దిగ్గజ టెలికాం కంపెనీలు జియో ప్రభావంతో కుదేలయ్యాయి.
 
అతి తక్కువ ధరలకే ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ప్లాన్స్‌ను జియో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో పెను సంచలనాన్ని సృష్టించిన జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఏ ప్రకటన రాబోతోందా అని సామాన్య ప్రజలతో పాటు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments