జియో యూజర్లకు తీపికబురు.. మరో యేడాది ఉచితం

జియో యూజర్లకు ఆ సంస్థ యాజమాన్యం తీపికబురు చెప్పింది. మరో యేడాది పాటు ఉచితంగా సేవలు పొందే వెసులుబాటును కల్పించింది. నిజానికి జియో ప్రైమ్ సభ్యత్వం 2018 మార్చి 31వ తేదీతో ముగియనుంది.

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (08:56 IST)
జియో యూజర్లకు ఆ సంస్థ యాజమాన్యం తీపికబురు చెప్పింది. మరో యేడాది పాటు ఉచితంగా సేవలు పొందే వెసులుబాటును కల్పించింది. నిజానికి జియో ప్రైమ్ సభ్యత్వం 2018 మార్చి 31వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంది. అయితే, అలాంటి అవకాశమే లేకుండా మరో యేడాది పాటు జియో ప్రైమ్‌ సర్వీసులను ఉచితంగా పొందవచ్చని తెలిపింది. 
 
ఇప్పటికే ప్రైమ్‌ సభ్యులుగా ఉన్నవారు ఎలాంటి రుసుము చెల్లించకుండా మరో ఏడాది (మార్చి2019) వరకు ఆ సేవలను పొందవచ్చని తెలిపింది. కొత్తగా జియో కనెక్షన్‌ తీసుకున్న వారు ఈ నెల 31 కంటే ముందు రూ.99 చెల్లించి మెంబర్‌ షిప్‌ తీసుకుంటే ఏడాది పాటు ప్రైమ్‌ ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. 
 
దీని కోసం యూజర్లు మై జియో యాప్‌‌లోకి వెళ్లి కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వాళ్లు లైవ్‌ టీవీ ఛానళ్లు, సినిమాలు, వీడియోలు, పాటలు, మ్యాగజైన్స్‌ సంబంధిత కంటెంట్‌‌ను ఉచితంగా యాక్సెస్‌ చేయవచ్చు. 2018 జనవరి నాటికి జియో వినియోగదారులు 17.5 కోట్లకు చేరుకున్నట్లు ఇటీవల జియో ప్రకటించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments