Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్.. హాలిడే హంగామా పేరుతో...

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో... తాజాగా తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ పాపులర్ ప్యాక్‌గా గుర్తింపు పొందిన రూ.399పై ర

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (10:46 IST)
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో... తాజాగా తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ పాపులర్ ప్యాక్‌గా గుర్తింపు పొందిన రూ.399పై రూ.50 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
 
మై జియోలోని ఫోన్‌పే ద్వారా రూ.399 ప్యాక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.50 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నేటి నుంచి ఈనెల 15 వరకు మాత్రమే ఆఫర్ అమలులో ఉంటుంది. రూ.399 ప్యాక్‌లో వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటా లభిస్తుంది. 
 
కాగా, రూ.399 రీచార్జ్ ప్యాక్‌పై ఇప్పటికే రూ.50 విలువైన డిస్కౌంట్ ఓచర్లు అందిస్తోంది. దీనికి ప్రస్తుతం ప్రకటించిన క్యాష్ బ్యాక్ అదనం. అంటే రూ.399 విలువైన ప్యాక్ 100 రూపాయల రాయితీతో రూ.299కే లభిస్తుందన్నమాట. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 'ఫోన్‌పే'తో ఒప్పందం కుదుర్చుకున్న జియో 'హాలీడే హంగామా' పేరుతో ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments