కొత్త చట్టంతో స్ఫూర్తి.. గూగుల్ యాడ్ రెవెన్యూలో 85 శాతం ఇవ్వాలి..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (13:53 IST)
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో స్ఫూర్తితో డిమాండ్‌కు తెరదీసింది. తమ కంటెంట్‌ను వాడుకుంటున్న గూగుల్ యాడ్ రెవెన్యూలో 85 శాతం ఇవ్వాలని ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్‌) డిమాండ్ చేస్తోంది. 
 
ఈ సొసైటీలో దేశ వ్యాప్తంగా ఉన్న వెయ్యి పత్రికలు నమోదై ఉన్నాయి. వేలాది మంది జర్నలిస్టులకు జీతాలు చెల్లిస్తూ సేకరిస్తున్న వార్తలను గూగుల్ వాడేసుకుంటుంది. అందుకుగానూ.. తమకు పరిహారం ఇవ్వాలని సొసైటీ క్లియర్‌గా చెప్పేసింది. కొద్ది రోజుల ముందే న్యూస్ వాడుకుంటున్నందుకు డబ్బులు చెల్లించాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది.
 
ఆస్ట్రేలియానే ప్రేరణగా తీసుకుంటూ.. భారత వార్తాపత్రికలు సైతం.. తాము ఎంతో ఖర్చు చేసి సంగ్రహిస్తున్న విశ్వసనీయ సమాచారాన్ని గూగుల్‌కు మొదటి నుంచీ ఇస్తున్నామని ఐఎన్ఎస్ ప్రకటనలో తెలిపింది. ఏడాది కాలం నుంచి ఇందులోనూ వాటా ఇవ్వాలని ప్రపంచవ్యాప్తంగా పలు న్యూస్ పేపర్లు గూగుల్‌ను డిమాండ్ చేస్తున్నాయి.
 
ఈ మధ్యే ఫ్రాన్స్‌, యురోపియన్ యూనియన్‌, ఆస్ట్రేలియాలోనూ పరిహారం చెల్లించడానికి గూగుల్ అంగీకరించిందని కూడా తెలిపింది. పత్రికలు ప్రధానంగా యాడ్స్‌పైనే ఆధారపడతాయని, డిజిటల్ స్పేస్‌లో మాత్రం మెజార్టీ వాటాను గూగుల్ తీసేసుకుని తమను నష్టానికి గురిచేస్తుందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments