Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారీ నష్టాలను చవిచూసిన భారత మార్కెట్లు

భారీ నష్టాలను చవిచూసిన భారత మార్కెట్లు
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:32 IST)
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ పేలవంగా స్టార్ట్ అయ్యాయి. వాల్ స్ట్రీట్‌, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు అందడంతో.. భారత మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇవాళ ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది. 50,184 పాయింట్ల వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్‌.. సుమారు 480 పాయింట్లు కోల్పోయింది. 
 
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో సతమతమైంది. 283 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. ఓ దశలో 14,835 వద్ద ట్రేడ్ అయ్యింది. మూడవ క్వార్టర్‌కు సంబంధించిన జీడీపీని నేషనల్ స్టాటిస్‌టికల్ ఆఫీసు రిలీజ్ చేయనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. అమెరికాలోని వాల్‌స్ట్రీట్ మార్కెట్ ప్రభావం ఆసియా మార్కెట్‌పై పడింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా ఇవాళ నష్టాలను ఎదుర్కొవాల్సి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైడెన్ ఆదేశాలు.. వైమానిక దాడులు 17మంది ఇరాన్ ఫైటర్లు మృతి