Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి భారతీయుడుగా ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (14:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో ఆయన్ను అనుసరిస్తున్న వారి సంఖ్య ఏకంగా ఐదు కోట్ల మందిని దాటేసింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. తద్వారా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. 
 
ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 10.8 కోట్ల మంది ఫాలోవర్లతో ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉండగా, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 6.4 కోట్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఒబామా, ట్రంప్ తర్వాత మోడీ మూడో స్థానంలో నిలిచారు.
 
కాగా, ఈ సందర్భంగా ఐదు కోట్ల మంది ఫాలోవర్లు దాటిన ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నాయకత్వ పటిమతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షితులైన ఆనేక మంది ప్రజలు ప్రధానిని సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. 
 
కాగా, ప్రస్తుతం మోడీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో 4.48 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ రెండింటిని కలుపుకుని ఐదు కోట్లకు చేరుకుంది. 
 
సోషల్ మీడియా మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒబామా 18.27 కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉండగా, మోడీ 11.09 కోట్ల మంది ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచినట్లు 'సెమ్ రష్' అనే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments