విండోస్ 10 మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ నిలిపివేత...

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (18:15 IST)
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్ 10 మొబైల్స్‌ కథ ముగిసిపోయింది. ఈ మొబైల్స్‌కు ఇకపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించబోమని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ ఫోన్లకు చివరి అప్‌డేట్‌ను మైక్రోసాఫ్ట్ డిసెంబర్ 10న విడుదల చేసింది. 
 
అందులో పలు సెక్యూరిటీ ప్యాచ్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఉన్నాయి. అయితే విండోస్ 10 మొబైల్‌లో వాడే వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తదితర ఆఫీస్ యాప్స్‌కు 2021 జనవరి 12వ తేదీ వరకు సపోర్ట్ ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ క్రమంలో ఆ తేదీ లోగా విండోస్ 10 మొబైల్ వినియోగదారులు తప్పనిసరిగా తమ ఫోన్లను మార్చాల్సి ఉంటుంది.
 
ఇదిలావుంటే, గత 2015లో నవంబరు నెలలో మొదటిసారిగా విండోస్ 10 మొబైల్ ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టగా.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల దెబ్బకు ఆ ఓఎస్ నిలబడలేకపోయింది. దీంతో 2017లో విండోస్ 10 మొబైల్ ఓఎస్ డెవలప్‌మెంట్‌ను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇక ఇప్పుడు చివరి అప్‌డేట్‌ను ఆ ఓఎస్ కోసం మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. దీంతో ఆ మొబైల్స్ కథ ఇక ముగిసినట్లయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments