Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఏమన్నారు..? ట్విట్టర్ Vs కేంద్రం...!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:34 IST)
సోషల్ మీడియాపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఖాతాలకు సంబంధించి కొన్ని కఠిన, స్పష్టమైన చర్యలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన బ్లూంబర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
 
ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో సోషల్ మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అసత్య, హింస ప్రేరేపిత ఖాతాలకు సంబంధించిన విషయంలో కచ్చితంగా కఠిన చట్టాలు, నిబంధనలు రూపొందించాలన్నారు. ప్రపంచంతో కలిసి బాగా పని చేసే వ్యాపార నమూనా అవసరమన్నారు. కొన్ని అంశాల్లో పోటీ లేకపోవడం సమస్యలను సృష్టిస్తోందని అభిప్రాయపడ్డారు.
 
ఇదిలా ఉంటే.. కొన్ని ఖాతాలను బ్లాక్ చేసే విషయమై సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌, కేంద్రం మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. ఇది అన్ని సోషల్ మీడియా వేదికలు, ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌, న్యూస్ సంబంధిత వెబ్‌సైట్లను నియంత్రించడానికి నిబంధనల రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో కోడ్ ఆఫ్ ఎథిక్స్‌, నిరంతర సమ్మతి నివేదికలను సమర్పించడంతోపాటు స్వీయ నియంత్రణ వ్యవస్థ తదితర నిబంధనలు ఇందులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments