Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢంగా ప్రేమించింది, పెళ్ళి సమయానికి మరో ప్రేమికుడితో జంప్...

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:17 IST)
నాలుగేళ్ళు ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోవాల్సిన వధువు ఆఖరి క్షణంలో మరో ప్రియుడితో వెళ్ళిపోవడంతో బంధువులు, స్నేహితులు నిశ్చేష్టులయ్యారు. చెన్నై నగరంలోని నుంగంబాక్కంకు చెందిన 23 యేళ్ళ పెరియమ్మాళ్ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది.
 
అదే సంస్థలో పనిచేస్తున్న నెమిలిచేరికి చెందిన సెంథిల్ కుమార్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది. దీంతో వీరి ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వివాహానికి ప్లాన్ చేశారు. కళ్యాణ మండపం బుక్ చేశారు. నిన్న సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. బంధువులతో హడావిడిగా మారిపోయింది మండపం.
 
ఉదయం 5 గంటలకే ముహూర్తం. అందరూ నిద్రించే సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు వధువు వేరొక యువకుడితో పారిపోయింది. వరుడు అంతా వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సిసి ఫుటేజ్‌లను పరిశీలిస్తే పెళ్ళి బట్టలతోనే యువకుడితో యువతి పారిపోయినట్లు గుర్తించారు.
 
సెంథిల్ కుమార్‌తో పాటు మరొక యువకుడితోను ఈమె ప్రేమాయణం సాగించినట్లు ఆమె స్నేహితులు తరువాత చెప్పారు. పారిపోయిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments