Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా ఖాతాలకు కూడా ఆధార్‌ను లింక్ చేస్తారా?

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (15:15 IST)
ఇప్పటికే గ్యాస్ కనెక్షన్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డులకు ఆధార్‌తో లింక్ చేసేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించందుకు రంగం సిద్ధమైంది. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ వివరాలను అనుసంధానించడానికి సంబంధించి చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో వున్నారో లేదా అనే దానిపై ఈ నెల 24లోపు తెలపాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.
 
జస్టిస్ దీపక్ మిశ్రా గుప్తా, అనిరుద్ధ బోస్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఫేస్‌బుక్ ఇంక్ వేసిన పిటిషన్‌ను విచారించింది. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు ఆధార్‌ను అనుసంధానించడంపై దాఖలై వివిధ హైకోర్టుల వద్ద పెండింగులో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఫేస్‌బుక్ ఇంక్ బదిలీ పిటిషన్ దాఖలు చేసింది. 
 
మద్రాస్ హైకోర్టులో రెండు, బొంబాయి, మధ్యప్రదేశ్ హైకోర్టులలో ఒక్కొక్కటి పిటిషన్లు దాఖలు చేసినట్లు ఫేస్ బుక్ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో ఆధార్‌ను అనుసంధానించడంపై విరుద్ధమైన నిర్ణయాలు భారతదేశమంతటా ఉపయోగించిన ప్లాట్‌ఫామ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఈ దశలో విచారణను కొనసాగించకపోతే కోలుకోలేని నష్టాన్ని చవిచూడవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments