Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.600లకే ఇంటర్నెట్, టీవీ, ల్యాండ్‌లైన్.. జియో గిగా ఫైబర్ ఆఫర్

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:26 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో.. మిగిలిన టెలికాం రంగాలకు చెందిన సంస్థల్ని గట్టిదెబ్బ కొట్టింది. కేవలం రూ.600లకే ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు చుక్కలు చూపించింది. రూ.600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్సులను అందించే ఆఫర్‌ను జియో ప్రవేశపెట్టడం ద్వారా మిగిలిన టెలికాం రంగ సంస్థలకు కళ్లు బయర్లు కమ్మాయి. 

గత 2018వ సంవత్సరం నుంచి జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభమయ్యాయి. జియో గిగా ఫైబర్ ఆఫర్‌ను పొందాలంటే ముందుగా రూ.4,500లను డిపాజిట్‌గా చెల్లించాలి. ఆపై చెల్లించే నెలసరి చెల్లింపుకు తగినట్లు ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. అయితే ప్రస్తుతం జియో సంస్థ రూ.600లకే ఇంటర్నెట్, ల్యాండ్ లైన్, టీవీ సెటాప్ బాక్స్ సేవలను అందించనుంది.
అంతేగాకుండా రూ.1,000లను అదనంగా చెల్లిస్తే.. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ అనే 40 గ్యాడ్జెట్లను పొందవచ్చు. జియో నుంచి లభించే ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. కానీ ఇతర టెలికాం సంస్థలకు మాత్రం జియో ఆఫర్ కాస్త గుదిబండలా మారింది. దీంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి సంస్థలకు షాక్ తగిలింది. ఫలితంగా తమ వినియోగదారులను కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థలు మల్లాగుల్లాలు పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments