మొబైల్స్ తయారీదారు ఐటెల్ నుంచి భారత్లో విజన్ 1 పేరిట ఓ నూతన స్మార్ట్ఫోన్ను విడుదల అయ్యింది. ఐటెల్ విజన్ 1 గ్రీన్, బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ రూ.6,999 ధరకు వినియోగదారులకు ఆగస్టు 18వ తేదీ నుంచి లభ్యం కానుంది.
ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్లను అందిస్తున్నారు. వెనుక వైపు 8, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాలను అమర్చారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అందిస్తున్నారు. ఇందులో 6.088 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను కలిగి వుంది.