5జీ స్పెక్ట్రమ్ కోసం భలే డిమాండ్.. నేడు కూడా వేలం

Webdunia
బుధవారం, 27 జులై 2022 (10:09 IST)
దేశంలో ఐదో తరం టెలికాం తరంగాల (5జీ) విక్రయం కోసం మంగళవారం నుంచి వేలం పాటలు సాగుతున్నాయి. తొలి రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేలం పాటలు సాగాయి. ఈ వేలం పాటల్లో 5జీ స్పెక్ట్రమ్ కోసం భలే డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా తొలి రోజు వేలం పాటల్లో బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటిపోయింది. రెండో రోజైన బుధవారం కూడా 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కోసం వేలం పాటను నిర్వహించనున్నారు. 
 
తొలిరోజు జరిగిన వేలం పాటల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఆదానీ గ్రూపుతో పాటు పలు సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. మొదటి రోజు వేలం పాటల్లో మొత్తం నాలుగు రౌండ్ల నిర్వహించామని, మొత్తం బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఐదో రౌండ్ పాటలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 
 
ఈ వేలం పాటల తర్వాత స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుపుతామని, ఈ ప్రక్రియ ఆగస్టు 15వతేదీ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ఈ యేడాది ఆఖరు నాటికి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తొలి రోజు జరిగిన వేలం పాటల్లో 3300 మెగార్ట్జ్, 26 గిగాహెర్ట్ట్ బాండ్స్ కోసం టెలికాం కంపెనీలు తీవ్రంగా పోటీపడ్డాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments