పాత వాట్సాప్ వెర్షన్‌లో సెక్యూరిటీ బగ్! కేంద్రం వార్నింగ్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (15:22 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాత వాట్సాప్ వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇలాంటి ఓ సెక్యూరిటీ బగ్‌నే ఇండియన్ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ ఇన్) గుర్తించింది. ఈ బగ్‌ను తీవ్రమైనదిగా గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో నోడల్ ఏజెన్సీగా సీఈఆర్టీ ఇన్ పని చేస్తుంది. వాట్సాప్‌లోని ఓ బగ్‌ను ఇది గుర్తించింది. వాట్సాప్ వీ2.22.16.12 వెర్షన్ వినియోగిస్తున్న వారు ఈ సెక్యూరిటీ బగ్‌కు ప్రభావితమవుతారని, అందువల్ల సీఈఆర్టీ ఇన్ పేర్కొంది. అందువల్ల ఆ వెర్షన్ వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లను ఓ హెచ్చరిక చేసింది. వాట్సాప్ కూడా ఈ సమాచారాన్ని చేరవసింది. 
 
అందువల్ల పాత వాట్సాప్ వెర్షన్ వాడుతున్నవారు తక్షణం కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పాత వెర్షన్ వాడుతున్న వారందరూ కొత్త వెర్షన్ మారాలని తెలిపింది. దీంతో ఈ బగ్స్‌ బారి నుంచి తప్పించుకోవచ్చని వెల్లడించింది. కొత్త వెర్షన్ యాప్‌లో వాట్సాప్ ఈ సమస్యలను ఫిక్స్ చేసినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments