వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు గూగుల్ షాకింగ్ న్యూస్.. ఏంటది?

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (10:01 IST)
వర్క్ ఫ్రమ్ ఉద్యోగులకు గూగుల్ సంస్థ షాకింగ్ న్యూస్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి గూగుల్ ఉద్యోగులు మారితే.. వారి వేతనంలో 25 శాతం కోత విధించాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై సిలికాన్ వ్యాలీలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
 
శాలరీ కాలిక్యులేటర్ ఆధారంగా ఉద్యోగుల పే కట్ నిర్ణయించబడుతుందని గూగుల్ పేర్కొంది. కంపెనీ ఉన్న నగరంలోనే పని చేస్తోన్న ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం ఎంచుకుంటే వేతనాల్లో ఎలాంటి కోత ఉండదని గూగుల్ తెలిపింది. 
 
వేతనం అనేది నగరం నుంచి నగరానికి.. అలాగే రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది. అందుకే పట్టణాలు, ప్రాంతాలు ఆధారంగా ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి మారితే గూగుల్ సంస్థ వేతనాల్లో 25 శాతం వరకు కోత విధించనున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగుల లొకేషన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశం ఉంది.
 
కాగా, గూగుల్ కంపెనీ వర్క్ లొకేషన్ టూల్ జూన్ నెలలో ప్రారంభమైంది. అటు ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థలు కూడా తక్కువ ఖరీదైన ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments