Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా కోవిడ్ ఎసెన్షియల్ కిట్.. జియో 3డీ గ్లాసెస్ కూడా వచ్చేస్తున్నాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:46 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జియో మార్ట్ ద్వారా తొలిసారి ఆర్డర్ చేసే వారికి ఉచితంగానే కోవిడ్ 19 ఎసెన్షియల్ కిట్ అందిస్తున్నట్లు తెలిపింది. ముకేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ ఈ విషయాన్ని తెలిపారు. 
 
జియోమార్ట్ స్థానిక కిరాణా స్టోర్ల భాగస్వామ్యంతో కస్టమర్లకు ఎలా సేవలు అందిస్తోందనే విషయాన్ని వార్షిక సమావేశం సందర్భంగా ఇషా అంబానీ వివరించారు. అలాగే టీచర్లు, విద్యార్థులు ప్రధాన లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో 3డీ గ్లాసెస్‌ను తీసుకువచ్చింది. 
 
జియో గ్లాసెస్ ద్వారా 3డీ వర్చువల్ రూమ్స్, హోలోగ్రాఫిక్ క్లాసెస్ నిర్వహణ వంటివి చేయొచ్చు. అంతేకాకుండా వర్చువల్ మీటింగ్స్ కూడా నిర్వహించొచ్చు. ఇంకా ఫోన్‌తో పనిలేకుండానే ఇతరులకు కాల్ చేయొచ్చు.
 
కేవలం ఎవరికి కాల్ చేయాలో చెబితే చాలు. వారికి కాల్ వెళ్తుంది. కాగా దీని ధర ఎంతో తెలియాల్సి ఉంది. అలాగే జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ 7.7 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.33,733 కోట్లు కావడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments