Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా కోవిడ్ ఎసెన్షియల్ కిట్.. జియో 3డీ గ్లాసెస్ కూడా వచ్చేస్తున్నాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:46 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జియో మార్ట్ ద్వారా తొలిసారి ఆర్డర్ చేసే వారికి ఉచితంగానే కోవిడ్ 19 ఎసెన్షియల్ కిట్ అందిస్తున్నట్లు తెలిపింది. ముకేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ ఈ విషయాన్ని తెలిపారు. 
 
జియోమార్ట్ స్థానిక కిరాణా స్టోర్ల భాగస్వామ్యంతో కస్టమర్లకు ఎలా సేవలు అందిస్తోందనే విషయాన్ని వార్షిక సమావేశం సందర్భంగా ఇషా అంబానీ వివరించారు. అలాగే టీచర్లు, విద్యార్థులు ప్రధాన లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో 3డీ గ్లాసెస్‌ను తీసుకువచ్చింది. 
 
జియో గ్లాసెస్ ద్వారా 3డీ వర్చువల్ రూమ్స్, హోలోగ్రాఫిక్ క్లాసెస్ నిర్వహణ వంటివి చేయొచ్చు. అంతేకాకుండా వర్చువల్ మీటింగ్స్ కూడా నిర్వహించొచ్చు. ఇంకా ఫోన్‌తో పనిలేకుండానే ఇతరులకు కాల్ చేయొచ్చు.
 
కేవలం ఎవరికి కాల్ చేయాలో చెబితే చాలు. వారికి కాల్ వెళ్తుంది. కాగా దీని ధర ఎంతో తెలియాల్సి ఉంది. అలాగే జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ 7.7 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.33,733 కోట్లు కావడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments