Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేశాడు... తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ చిన్నారిపై నాలుగేళ్ళ క్రితం అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు.. ఇపుడు తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఈ దారుణం గత మంగళవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన యశ్‌వీర్‌ అనే నిందితుడు గతంలో బాధిత కుటుంబంతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఈక్రమంలో అతడు 2016లో ఆ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. 
 
జరిగిన ఘోరం గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యశ్‌వీర్ జైలు పాలయ్యాడు. అయితే ఇటీవల బెయిలు‌పై విడుదలైన నిందితుడు బాధితురాలు, ఆమె తల్లిపై పగ తీర్చుకోపాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆ తల్లీకూతుళ్లు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇది గమనించిన నిందితుడు.. తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్‌ పోనిచ్చి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యశ్‌వీర్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments