Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశీయ టెక్నాలజీతో 5జీ సేవలు : ముఖేష్ అంబానీ (video)

దేశీయ టెక్నాలజీతో 5జీ సేవలు : ముఖేష్ అంబానీ (video)
, బుధవారం, 15 జులై 2020 (17:49 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఇందులో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దేశంలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 4జీ సేవలు గత చరిత్ర కానున్నాయి. 5జీ టెక్నాలజీని దేశీయంగా పూర్తి స్థాయిలో అభివృద్ది చేశామన్నారు. 
 
ముంబైలో జరిగిన రిలయన్స్ 43వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని  చెప్పారు. వచ్చే ఏడాది క్షేత్ర స్థాయిలోకి 5జీని తీసుకొస్తామని తెలిపారు. జియోలోకి 5జీని తీసుకువస్తుండటం ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పారు.
 
20 మంది స్టార్టప్‌ పార్ట్‌నర్లతో కలిసి 4జీ, 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్, డివైజెస్, ఆపరేటింగ్ సిస్టమ్, బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఏఆర్/వీఆర్, బ్లాక్ చైన్, నేచురల్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్, కంప్యూటర్ విజన్ వంటి టెక్నాలజీలను జియో ప్లాట్ ఫామ్స్ అభివృద్ది చేసిందని తెలిపారు.
 
వరల్డ్ క్లాస్ టెక్నాలజీలకు ధీటుగా జియో ప్లాట్ ఫామ్స్ ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేసిందని ముఖేశ్ వెల్లడించారు. ఈ టెక్నాలజీల సాయంతో మీడియా, ఫైనాన్సియల్ సర్వీసెస్, కామర్స్, విద్య, హెల్త్ కేర్, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, స్మార్ట్ మొబిలిటీ వంటి వైవిధ్యభరితమైన రంగాలకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 
 
తమ టెక్నాలజీని ప్రస్తుతానికి మన దేశానికే వినియోగిస్తామని.. ఆ తర్వాత ఇతర దేశాలకు తీసుకెళ్తామని చెప్పారు. రానున్న మూడేళ్ల కాలంలో 50 కోట్ల మొబైల్ వినియోగదారులకు జియో కనెక్ట్ అవుతుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. 100 కోట్ల స్మార్ట్ సెన్సార్లు, 5 కోట్ల హోమ్, బిజినెస్ వ్యవస్థల (ఎస్టాబ్లిష్ మెంట్లు)కు అనుసంధానమవుతుందన్నారు. 
 
మొబైల్ బ్రాడ్ బ్యాండ్, జియో ఫైబర్, జియో ఎంటర్ ప్రైస్ బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ బ్యాండ్ ఫర్ ఎస్ఎంఈ, జియో నేరో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే ఐదు డిజిటల్ కనెక్టివిటీలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో జియో అద్భుతాలను సృష్టించబోతోందని తెలిపారు.

అంతేకాకుండా, జియో 4జీ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు నిబద్దతను కలిగి ఉంది. ఈరోజు వరకు 10 కోట్ల జియోఫోన్లను విక్రయించాం. గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో ఎంట్రీ లెవల్‌ 4జీ, 5జీ ఫోన్లను తయారీ చేయగలమని నమ్ముతున్నాం అని ముఖేశ్ అంబానీ తెలిపారు.  
 

 
ఇప్పటికీ 35 కోట్ల మంది 2జీ స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తారని, వారి దృష్టిలో ఉంచుకొని చౌకధరల్లో స్మార్ట్‌ఫోన్‌ తయారీకి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. జియో, గూగుల్‌ సంయుక్త భాగస్వామ్యంలో తయారీ అయ్యే 4జీ, 5జీ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌.... ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్‌ను ఆప్టిమైజ్‌ చేసుకోనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 
 
అదేవిధంగా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ అంశంపై గూగుల్‌ స్పందిస్తూ, 50 కోట్ల భారతీయులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి రూపొందించిన టెక్నాలజీ, నెట్‌వర్క్‌ ప్రణాళికల్లో మార్పులను చూడటం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఇప్పటికీ చాలామందికి ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. చాలా తక్కువమంది స్మార్ట్‌ఫోన్‌ వినియోదిస్తున్నారు. ఇకపై టెక్నాలజీలతో పాటు డివైజ్‌లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌ది ఆత్మహత్య కాదు.. హత్యే.. దావూదే కారణం?