ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచిత డేటా? ఎలా?

Webdunia
ఆదివారం, 28 నవంబరు 2021 (10:04 IST)
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన టారిఫ్‌లకు ఉచితంగా డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 
 
ఇటీవల ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ టారిఫ్‌తో పాటు డేటా ధరల్ని పెంచిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, ప్రీపెయిడ్ ధరల్లో 20 నుంచి 25 శాతం మేరకు పెంచేసింది. అలాగే డేటా టాప్‌అప్ ప్లాన్లపై కూడా 20 నుంచి 21 శాతం మేరకు పెంచేసింది. 
 
ఈ పెరిగిన ధరలు శుక్రవారం అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రీపెయిడ్ సెలెక్టడ్ ప్లాన్స్‌పై ప్రతి రోజూ 500 ఎంబీ వరకు డేటాను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించింది. ఇది చాలా మంది యూజర్లకు సౌలభ్యంగా ఉండనుంది. 
 
మరోవైపు, ఎయిర్ టెల్ పెంచిన ధరల మేరకు.. ఇప్పటివరకు రూ.79గా ఉన్న బేసిక్ ప్లాన్ ఇపుడు రూ.99కు చేరింది. దీని కాలపరిమితి 28 రోజులుగా నిర్ణయించింది. 
 
అలాగే, అన్‌లిమిటెండ్ వాయిసా కాల్ ప్లాన్‌ను రూ.149 నుంచి రూ.179కి పెంచేసింది. అలాగే, రూ.2498 ప్లాన్‌ను ఇపుడు ఏకంగా రూ.2999కు చేర్చింది. ఇది వార్షక ప్లాన్. 
 
అదేవిధంగా డేటా ప్లాన్‌లో డేటా టాప్‌అప్‌లో రూ.48 ప్లాన్‌ను ఇకపై రూ.58కి పెంచింది. అలాగే, రూ.98 ప్లాన్‌ను కొత్తగా రూ.118కు చేర్చింది. ఈ ప్లాన్ కింద 12 జీబీ డేటాను ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments