Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దిరిపోయే ప్లాన్‌తో జియోను దెబ్బతీసేందుకు సిద్ధమైన బీఎస్ఎన్ఎల్

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:00 IST)
జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికం సంస్థలు మూతపడగా, ఆ దెబ్బను తట్టుకుని నిలబడ్డ కొన్ని సంస్థలు జియోను అధిగమించడానికి సర్వశక్తులూ ఉపయోగిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది.
 
బిఎస్‌ఎన్ఎల్ ఇప్పటికే అందిస్తున్న రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో తాజాగా మార్పులు చేసింది. ఈ ప్లాన్ క్రింద వినియోగదారులు ఇప్పటి వరకు అపరిమిత లోకల్ మరియు ఎస్‌టీడీ కాల్‌లతో పాటు ప్రతిరోజూ 1 జీబీ డేటాను పొందుతుండగా ఇక నుండి రూ. 349తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు అపరిమిత కాల్‌లతో పాటుగా 3.2 జీబీ డేటాను అందించనుంది. 
 
దీని వ్యాలిడిటీ 64 రోజులుగా ఉంటుంది. అంతే కాకుండా డేటా స్పీడ్‌ను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ ఆఫర్ ఢిల్లీ, ముంబై సర్కిల్స్ మినహా అన్ని ప్రాంతాల వినియోగదారులకు వర్తిస్తుంది.
 
కాగా ఇదే మొత్తానికి జియో 1.5 జీబీ డేటాను అందిస్తుండగా బిఎస్‌ఎన్ఎల్ దానికి రెట్టింపు కంటే ఎక్కువగా 3.2 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఇలాగే కొనసాగితే జియో కూడా నష్టాల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments