Webdunia - Bharat's app for daily news and videos

Install App

140 కిమీ వేగంతో లారీపైకి దూసుకెళ్లిన కారు.. నాగార్జున మృతి

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:55 IST)
విజయవాడ కృష్ణలంక హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఓ కారు.. కృష్ణలంకకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన నాగార్జున, హరీశ్, ప్రియాంకతో పాటు మరో యువకుడు ఉన్నాడు. వీరిలో నాగార్జున అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments