Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల్యాండ్​ లైన్​ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ గుడ్​న్యూస్​.. ఈ మైగ్రేట్​ సేవలు..?

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (18:04 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ ల్యాండ్​ లైన్​ యూజర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. పాత ల్యాండ్​లైన్ నెంబర్​తోనే ఫైబర్ టు హోమ్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్​కు మైగ్రేట్ కావడానికి అవకాశం కల్పిస్తోంది. 
 
హువావే, యూటీ స్టార్‌కామ్ ల్యాండ్‌లైన్ నంబర్లతో సహా అన్ని బీఎస్​ఎన్​ఎల్ ల్యాండ్​లైన్​​ యూజర్లకు ఈ మైగ్రేట్​ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే సీడీఓటీ యూజర్లకు మాత్రం ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు.
 
బీఎస్​ఎన్​ఎల్ ఈ స్కీమ్​ను గతేడాది సెప్టెంబర్​లోనే ప్రారంభించింది. దీని ప్రకారం బీఎస్​ఎన్​ఎల్​ ల్యాండ్‌లైన్ కస్టమర్లు తమ ల్యాండ్‌లైన్ నంబర్‌ను భారత్ ఫైబర్ వాయిస్ లేదా వాయిస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కు ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు.
 
బీఎస్​ఎన్​ఎల్​ కేరళ టెలికాం సర్కిల్​ ముందుగా దీన్ని అమల్లోకి తెచ్చింది. యూజర్లు తమ ల్యాండ్‌లైన్ నంబర్‌ని ఫైబర్ కేటగిరీగా మార్చేందుకు వారి సిస్టమ్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను చేర్చింది. 
 
బీఎస్​ఎన్​ఎల్​ ల్యాండ్​లైన్​ కస్టమర్లు బ్రాండ్​ బ్యాండ్​ సేవలకు మైగ్రేట్​ కావాలనుకుంటే వెంటనే సమీపంలోని బీఎస్​ఎన్​ఎల్​ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి, రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments