Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్ః రూ.49లకే 28 రోజుల వ్యాలిడిటీ

Advertiesment
BSNL
భారత ప్రభుత్వానికి చెందిన టెలికం సంస్థ (బీఎస్‌ఎన్‌ఎల్) అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ. 49లకే 28 రోజుల వ్యాలిడిటీని ఈ ప్లాన్ కలిగి ఉండడం విశేషం. ఇది అత్యంత చౌకైన ప్లాన్. దీని ధర కేవలం రూ. 49 మాత్రమే. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 100 నిమిషాల టాక్ టైం లభిస్తుంది. దీంతో పాటు 2 జీబీ డేటా కూడా వాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
 
జియోతో పాటు వోడాఫోన్ ఐడియా సైతం ఇలాంటి ప్లాన్లను తీసుకువచ్చాయి. జియో కస్టమర్లు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు నిత్యం 1 జీబీ డేటా పొందొచ్చు. నిత్యం 100 ఎస్ఎంఎస్ లను పంపించుకోవచ్చు. జియోకు చెందిన వివిధ యాప్ లకు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు. 
 
వోడాఫోన్ ఐడియా కూడా రూ.149 తో అత్యంత తక్కువ ధరకు ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 2 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. 300 SMS లు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా బంగారు నాణెం రికార్డ్.. ఏకంగా వేలంలో రూ.14కోట్లు పలికింది..!