Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాలుగు నెలల పాటు 100కిలో మీటర్లు.. 4 నదులు దాటిన పులి

నాలుగు నెలల పాటు 100కిలో మీటర్లు.. 4 నదులు దాటిన పులి
, బుధవారం, 9 జూన్ 2021 (10:00 IST)
పశ్చిమ బెంగాల్‌లో అదృశ్యమైన ఓ పులి కొండలు, కోనలు దాటుకుంటూ నాలుగు నెలలపాటు వంద కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్ చేరుకుంది. పులి తన ప్రయాణంలో నాలుగైదు నదులు, మూడు దీవులను దాటింది. అది తన ప్రయాణంలో ఎక్కడా జనావాసాల్లో చొరబడకపోవడం గమనార్హం. 
 
బెంగాల్ అడవుల నుంచి అదృశ్యమైన ఈ పులి ఆచూకీని దాని మెడకు అమర్చిన రేడియో ట్యాగింగ్ పరికరం ద్వారా అటవీ అధికారులు కనుగొన్నారు. సుందర్బన్ అడవుల్లో కనిపించిన ఈ పులికి గతేడాదే ఈ పరికరాన్ని అమర్చారు. ఇప్పుడు అదే దాని ఆచూకీని తెలిపింది. అలాగే, ఒకవేళ ఆ పులి కనుక మరణిస్తే ఆ విషయాన్ని తెలియజేసేందుకు కూడా ఓ సెన్సార్‌ను అమర్చారు.
 
బెంగాల్ అడవుల నుంచి బయలుదేరిన ఈ పులి బంగ్లాదేశ్‌ వైపుగా వెళ్తూ గత నెల 11న ఆ దేశంలోని తల్‌పాట్టి దీవికి చేరుకుంది. ఆ తర్వాత రేడియో ట్యాగింగ్ పరికరం పనిచేయడం మానేసింది. దీంతో దాని ఆచూకీ కనుగొనడం కష్టమైంది. 
 
తాజాగా, ఆ పులి బంగ్లాదేశ్‌లోని సుందర్బన్ అడవుల్లో ఉన్నట్టు గుర్తించారు. గతంలో అది అక్కడి నుంచే పశ్చిమ బెంగాల్ అడవుల్లోకి వచ్చి ఉంటుందని, ఇప్పుడు మళ్లీ అది సొంత ప్రాంతానికి చేరుకుని ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో పానీ పూరీ వ్యాపారం కుదేలు.. ఆవుదూడ కూడా..?